One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లో తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ టీఎంహెచ్వో డాక్టర్ చంద్రహాసన్ రెడ్డి మాట్లాడుతూ డెంగ్యూ నివారణ పై అవగాహన కలిగించే అందుకే మే 16వ తేదీ జాతీయడెంగ్యూ నివారణ దినోత్సవంగా పాటిస్తున్నారు దోమలు పగటిపుట కుట్టడం వలన వచ్చే వెకార్ ద్వారా సంక్రమించే వైరస్ వ్యాధి అవి నిలిచిపోయిన నీటిలో సంతాన ఉత్పత్తి చేస్తాయి దాని జీవిత చక్రం పూర్తి చేయడానికి ఏడ నుంచి 12 రోజులు పడుతుంది దోమల వల్ల సోకే వ్యాధులు వాటి నియంత్రణ సొసైటీలో నిలువ పద్ధతులు స్వీయ రక్షణ పద్ధతులు స్వచ్ఛమైన వాతావరణం త్రాగనీరు గురించి సమాజంలో అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు
డెంగ్యూ వ్యాధి నియంత్రణలో భాగంగా ఇంటి చుట్టుపక్కల పారేసిన వస్తువులలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, అలాగే ఇంట్లో ఉన్న ట్యాంక్, ట్రంక్ లోనికి నీటిని ఏడు రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని తెలిపారు.
One Tv News