One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక ఎండిఓ కార్యాలయం ఆవరణలో ఎండిఓ మస్తాన్ వలీ,ఎంపీపీ. చెగిరెడ్డి తులసమ్మ, కందులాపురం సర్పంచ్. మొక్కలు నాటారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎంపీపీ చెగిరెడ్డి తులసమ్మ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం అటవీశాఖ అధికారి ఇమ్రాన్ ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంల లో ఇంచార్జ్ ఎండిఓ మస్తాన్వలి, ఏఓఆర్డి, ఎంపీపీ. చెగిరెడ్డి తులసమ్మ, కందులాపురం సర్పంచ్, హజరత్ గూడెం సర్పంచ్ మహబూబ్ పీరా,ఎండిఓ కార్యాలయ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
One Tv News