One Tv News - NEWS / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కిసాన్ మోర్చా ఒక రోజు రైతు దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈసందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ల తీరును విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ లక్ష రూపాయల వ్యవసాయ రుణమాఫీ చేయలేదని, ఖరీఫ్ సీజన్ లో గత ప్రభుత్వాలు విత్తనాలు, ఎరువులు ఇచ్చాయని కానీ కెసిఆర్ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇటువంటి సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందడం లేదని విమర్శించారు.
One Tv News