One Tv News - NEWS / రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్"* ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజల వద్ద నుండి స్వయంగా వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి నెల మొదటి మంగళవారం ప్రత్యేక ఠాణ దివస్ చేశారు. వేముల వాడ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అద్వర్యంలో ఠాణా దివస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుండి 76 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామా స్థాయిలో నెలకొన్న శాంతి భద్రత ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్"ప్రతి నెల మొదటి వారంలో రోజు పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం తెలిపారు.
One Tv News