One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి 136 సీట్లు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు పాల్గొన్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.
పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు కర్ణాటక ఎన్నికల నిదర్శనమని తెలిపారు.
One Tv News