One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూల్లో అంతర్జాతీయ మదర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఆవోపా మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్ విహార్ కూడలి వరకు మాతృమూర్తులను కాపాడుకుందాం వృద్ధాశ్రమాలను అరికడదాం అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు.
ప్రతి మహిళ తల్లిదండ్రులతోపాటు అత్తమామలను గౌరవించాలని మహిళా మండలి నాయకురాళ్లు తెలియజేశారు. ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలని తెలిపారు.
One Tv News