One Tv News - NEWS / నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లే తాండ గ్రామంలో మంగళవారం మారెమ్మ తల్లి జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు తాండా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని మారెమ్మ ను, సేవాలాల్ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు.
ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, పలువురు వైసిపి నాయకులు కూడా ఆయన వెంట పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై నరసింహులు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
One Tv News