One Tv News - NEWS / పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లానోట్ల మార్పిడి చేస్తామని జిల్లా కేంద్రంలో 90 లక్షల నగదుతో పరారీ అయిన సంఘటన చోటుచేసుకుందితొంభై లక్షలకు ఐదు వందల నోట్లు ఇస్తే కోటి రూపాయల రెండు వేల రూపాయల నోట్లు ఇస్తామని ఎర వేశారు దీంతో ఆశ పడి తమ స్నేహితుల వద్ద అప్పులు తెచ్చి తొంభై లక్షలకు ఐదు వందల నోట్లు ఆముదాల వలస కు చెందిన ఎ.అనిల్, వి.అనిల్ లు అందజేశారుపార్వతీపురం తొంభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగా, కోటి రూపాయలు రెండు వేల నోట్లు వేరే చోట ఉన్నాయని నమ్మించి తొంభై లక్షలతో పరారీ అయ్యారుఈ నెల 23న బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
ఈ కేసుకు సంబంధించి కాకినాడ, భీమవరం చెందిన చక్రపాణి, నజిమ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
One Tv News