One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా కోమరోలు మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాo నిర్వహించి అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తహశీల్దార్ రమాదేవి Z.P.T.C సారె వెంకట నాయుడు మరియు M.P.T.C. కామురి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా సచివాలయంలో కార్యదర్శి సురేష్ అధ్యక్షత న నిర్వహిచిన అవగాహన కార్యక్రమంలో తాటిచేర్ల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద రావు మాట్లాడుతూ పర్యావరణహిత జీవనశైలి మనమందరం ఆలవరచుకోవాలని ప్లాస్టిక్ కవర్లు వాడకం మానివేయలని, చెట్లను కాపాడు కోవాలని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని, నీటిని వృధా చేయరాదని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని కోరి జీవనశైలి ప్రతిజ్ఞను చేయిoచిచారుఅనంతరం కార్యదర్శి సురేష్ సచివాలయప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, విజయ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అల్లినగరమ్ సెక్షన్, లక్ష్మి నారాయణ ఫారెస్ట్ బీట్ అధికారి, అల్లినగరం బీట్ అధికారి, సునీల్ కుమార్ ఫారెస్ట్ బీట్ అధికారి గుంత పల్లి బేస్ క్యాంప్ సిబ్బంది, అల్లినగరం బీట్. తాటి చేర్ల సెక్షన్ సిబ్బంది. కొమరోలు రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు వాలింటర్లు పాల్గొన్నారు.
One Tv News