One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఈ నాలుగు సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ కు ఒక సువర్ణ అధ్యయమని ప్రజా సంక్షేమo లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు.అనపర్తి వైసిపి నియోజకవర్గ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గ నేతలతో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు...
ఈ సందర్భంగా మీడియాతో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ కు సువర్ణ యుగం అని వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాలుగా 98% అమలు చేశారని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తనదైన శైలిలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని విపక్షాలు ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కలిగించిన జగన్మోహన్ రెడ్డి క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు
One Tv News