One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పటు చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ , కుడ ఛైర్మన్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనధికారికoగా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని. ప్రజలు ఎవరు మోస పోకుండా ప్రభుత్వమే అన్ని వసతులతో 64 కోట్ల రూపాయలతో 110 ఎకరాల్లో ఈ లేఅవుట్ ప్లాట్లను నిర్మించి అన్ని వసతులు ప్రభుత్వమే ఏర్పటు చేస్తుందన్నారు.
తక్కువ ధరలోనే ఏర్పటు చేయడం జరిగిందన్నారు.1106 ప్లాట్ లు ఏర్పటు చేసి అందులో 3,4,5 సెంట్ల ప్లాట్లు ఏర్పటు చేయడం జరిగిందని, ఇందులో ప్రభుత్వ పెన్షనర్లకు ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం స్పెషల్ ఆఫర్ కల్పించడం జరిగిందన్నారు
One Tv News