One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ మైలవరం రేంజ్ లక్ష్మీపురం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వారి ఆధ్వర్యంలో పర్యావరణ జీవనశైలి గురించి చెత్తను తగ్గించుట ఆరోగ్య కరమైన జీవన విధానం పాటించటం అనే అంశాలపై మరియు ప్లాస్టిక్ సంచులు ఉపయోగించటం వల్ల జరిగే నష్టాలు, భూగర్భ జలాల కాలుష్యం ఇతర మొదలైన వాటితో ఇబ్బంది కలిగే నష్టాలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి నాగజ్యోతి, చెక్ పోస్ట్ హెల్పర్ కంభంపాటి సునీల్, గ్రామస్తులు, యువకులు, తదితరులు, పాల్గొన్నారు.
One Tv News