One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సోదరుడు ఆళ్ల ప్రసాద్ 12వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఏఎంసి చైర్మన్ రాంప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... 12 సంవత్సరాల క్రితం వాళ్ల ప్రసాదు తీర్థయాత్రలకు వెళ్లి మృతి చెందాడనీ అన్నారు.
15 డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము మాట్లాడుతూ ఆళ్ల ప్రసాదు మృతి తీరని లోటుని ఆయన చనిపోయిన దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా ఆయన జ్ఞాపకార్థం వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వచ్చామన్నారు నగరంలోని జ్వాలా పహారేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
One Tv News