One Tv News - NEWS / కర్నూలు జిల్లా : మల్లవరం గ్రామ సమీపంలోని ఫారెస్ట్ లో ఏప్రిల్ 12న వైసిపి నాయకులు రంగురాళ్ల తవ్వకం పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మాజీ మంత్రి తెలుగుదేశం నాయకులు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను కర్నూల్ లోని ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్తలో అటవీ అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.
తాను చేసిన ఫిర్యాదుకు మొక్కుబడిగా బీట్లో డ్యూటీ చేస్తున్న ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఎటువంటి ప్రైవేట్ కార్యకలాపాలు జరుపకూడదని అక్కడ జరిగిన అక్రమ తవ్వకాల గురించి అన్ని ఆధారాలను లోకాయుక్తకు సమర్పించాలని లోకాయుక్త వారు కేసు రిజిస్టర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
One Tv News