One Tv News - NEWS / చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా కుప్పం లో 80 ఏళ్ల వృద్ధురాలు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. కుప్పం మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో నివాసముంటున్న సులోచనమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఆమెకు ఎవరు లేకపోవడంతో మనస్థాపానికి గురై నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహం గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయింది.ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
One Tv News