One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూల్ నగరంలోని బుధవార పేటలో హనుమాన్ జిమ్ నందు తక్కువ ధరకే అవకాశం అందిస్తున్నామని ఈ అవకాశాన్ని నగరంలోని యువకులు, జిమ్ ఉత్సాహకులు సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ జిమ్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు ఆయన మన తెలుగు టీవీ రిపోర్టర్ తో మాట్లాడుతూ అన్ని రకాల అనారోగ్యాలకు పరిష్కార మార్గం చూపుతామని వాటిని జిమ్లో కొన్ని వ్యాయామాలు చేయటం ద్వారా అనారోగ్యాలను సైతం దూరం చేసుకోవచ్చని అన్నారు లావు ఎక్కువగా ఉన్నవారు తగ్గటానికి లావు తక్కువగా ఉన్నవారు పెరగటానికి అల్సర్ ,బిపి ,షుగరు తగ్గించుకోవటానికి ఈ ఎక్సర్సైజు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల నుంచి ఐదు గంటల 30 నిమిషాల వరకు వారికి జిమ్ లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని అన్నారు
కాగా మగవారికైతే ఉదయం 5 నుంచి 8:30 వరకు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి 9 వరకు జిమ్ తెరిచే ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ తెలిపారు ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ జిమ్ములో వ్యాయామం చేస్తే వారికి అవన్నీ కూడా నయమవుతాయని తెలిపారు కాగా కర్నూలు నగరంలోని అతి తక్కువ ఫీజు కి మేము ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలిగిస్తున్నామని తెలిపారు మా జిమ్ములో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, స్టమక్ ,స్లిమ్బాత్ ,ఫిట్నెస్, తాడుతో ఆట, అన్ని రకాల వ్యాయామాలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా పొట్ట తగ్గటానికి చక్కటి వ్యాయమం చూపిస్తామని రామకృష్ణ తెలిపారు
One Tv News