One Tv News - NEWS / విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సోమవారం ఉదయం నిర్వహించిన సంఘీభావ పాదయాత్ర విజయవంతంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.
గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బొండపల్లి గ్రామం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.
One Tv News