One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం లోని పొలాసిగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు గిరిబాబు ఆధ్వర్యంలో బల్లారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామవరపు కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. 2024లో నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసే దిశగా ప్రతి ఒక్కళ్ళు అడుగులు వెయ్యాలని, అనుదిన ప్రార్ధనలో అను నిత్యం జ్ఞప్తిక చేసుకోవాలని అలా చేసినప్పుడే చంద్రన్న ప్రభుత్వం వచ్చి అందరి జీవితాలలో వెలుగులు నిండుతాయని అందుకోసం ప్రతీ ఒక్కరూ కూడా ప్రార్ధన చెయ్యాలని చింతలపూడి నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పొలాసగూడెం గ్రామ అధ్యక్షులు సాయి కృష్ణ అక్కినేని రాజేష్ తంబి పాల్గొన్నారు.
One Tv News