One Tv News - NEWS / ఖమ్మం జిల్లా : ములుగు జిల్లా పోలీస్ హెడ్ కోటర్స్ నందు లొంగిపోయిన 200 మంది మాజీ నక్సలైట్లతో ఓ ఎస్ డి అశోక్ కుమార్ లోన్ మేళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్,బ్యాంక్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓ ఎస్ డి అశోక్ కుమార్ మాట్లాడుతూ...మన ములుగు జిల్లా మావోయిస్టు ప్రభావిత గల ప్రాంతమని, లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు కోసం బ్యాంక్ అధికారులతో లోన్ మేళా నిర్వహించమని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.
లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు తారతమ్యం లేకుండా అందరూ ప్రభుత్వం ఇచ్చేPMEGP సబ్సిడీ లోన్లను వినియోగించుకొని డెవలప్ కావాలని మాజీ నక్సలైట్లకు సూచనలు ఇచ్చారు.
One Tv News