One Tv News - NEWS / జగిత్యాల జిల్లా : జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకెపి సెంటర్ వద్ద రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.సోమవారం జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారిపై బస్తాలు వేసి వాటి పై కూర్చొని నిరసన తెలిపారు.
30 రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతే అధికారులు కొనుగోళ్ళు వేగవంతం చేయకపొవ డం తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.
One Tv News