One Tv News - NEWS / కాకినాడ జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని రైతులు ఆర్థికంగా ఎదగాల నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజ కోట ఆవరణలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సుమారు 5 కోట్ల రూపాయలతో. 25 ట్రాక్టర్లు రెండు వరి కోత మిషన్లు అదేవిధంగా పలు వ్యవసాయ పనిముట్లు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు.
One Tv News